telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాపై పోరుకు తమ ప్రభుత్వం సన్నద్ధతతో ఉంది: మంత్రి బుగ్గన

Mla buggana,data leake

కరోనాపై పోరుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ఏపీ మంత్రి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సీఎం జగన్ వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రతిదానికి విమర్శిస్తుండడం సరికాదని హితవు పలికారు.

కరోనా బాధ్డితులకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందజేయాలని ప్రతి ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన స్పందించారు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత ఉన్నా, తమ వద్ద ఉన్నంతవరకు అందిస్తున్నామని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లోనే డాక్టర్లందరికీ పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు.రాష్ట్రంలో తొలుత తక్కువ కేసులే నమోదైనప్పటికీ, ఓ సంఘటన కారణంగా కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.

Related posts