telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి ఎమ్మెల్సీ కవిత

దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి, సాయిబాబా టెంపుల్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమన్న ఎమ్మెల్సీ కవిత, దేవాలయల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ ‌కవిత గారికి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ చైర్మన్ శివయ్య, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మెంబర్ డా. విజయ రంగ పాల్గొన్నారు. కాగా.. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత…తర్వాత యాక్టివ్‌ పాలిటిక్స్‌లో చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. ప్రతి ప్రజా కార్యక్రమాల్లో, టీవీ డిబెట్లల్లో కనిపిస్తున్నారు ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత.

Related posts