telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

150 కోట్ల క్లబ్ లో “మిషన్ మంగళ్”

Mission-Mangal

ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై బాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిన చిత్రం “మిష‌న్ మంగ‌ళ్‌”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 2013లో భారత్‌ చేపట్టిన “మంగళ్‌యాన్‌‌” మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ చిత్రాన్ని జ‌గ‌న్ శ‌క్తి తెరకెక్కించారు. అక్షయ్‌ కుమార్‌ ఇందులో రాకేష్‌ పాత్ర పోషించగా, తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. విడుదలైన తొలి రోజే రూ.29.16 కోట్లు వసూలు చేసి..అక్షయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ చిత్రం 11రోజుల్లోనే 150కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 11రోజుల్లోనే 150కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ రెండో సినిమాగా మిషన్ మంగళ్ నిలిచింది. మొదటి సినిమా రజినీకాంత్‌తో చేసిన 2.0 పది రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. ఇండియా మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.164కోట్లు వసూలు చేసింది.

Related posts