telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరీంనగర్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం: కేటీఆర్‌

KTR TRS Telangana

కరీంనగర్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో శుద్ధమైన తాగునీటి సరఫరా కోసం రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్‌ పట్టణంలో ప్రతి రోజు మంచి నీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ఏ పని ప్రారంభించినా కరీంనగర్‌లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందని అన్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో 247 వాటర్‌ సైప్లె కూడా కరీంనగర్‌ నుంచే ప్రారంభం కావాలన్నారు.

30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టమని అన్నారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి రూ. 1కే నల్లా కనెక్షన్‌ ఇస్తామన్నారు. రాష్ట్రమంత ఈ పథకం ఆదర్శం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Related posts