telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వాల్వ్ ఎన్‌-95 మాస్కులను వాడొద్దు… కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక

N95

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సోషల్ డిస్ట్రెన్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో ప్రపంచంలో మాస్క్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే చాలామంది మెడికేటెడ్, ఎయిర్ ఫిల్టరేషన్ చేసే వాల్వ్ మాస్కులను కొనుగోలు చేసి ధరిస్తున్నారు. ఇలాంటి వాల్వ్ మాస్కులు సురక్షితం కాదని, కరోనా వైరస్ అడ్డుకోలేవని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ హెచ్చరించారు. ఈ ఎన్‌-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని ఆయన కోరారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాస్తూ… ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధారణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. వాల్వ్ మాస్కులు బయట నుంచి వచ్చే గాలిని ప్యూరిఫై చేస్తాయి. అయితే బ్రీత్ ఔట్ చేసినపుడు ఆ వాల్వ్ ల నుంచి గాలి ఫోర్స్ గా బయటకు వెళ్తుంది. బ్రీత్ ఔట్ చేసిన గాలిని వాల్వ్ లు ప్యూరిఫై చేయవు. కరోనా రోగులు ఎవరైనా ఇలాంటి వాల్వ్ మాస్కులు ధరించి బయటకు వస్తే, ఉశ్చ్వాస క్రియ ద్వారా గాలితో పాటుగా కరోనా బయటకు వస్తుంది. ఫలితంగా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకు కరోనా సోకె ప్రమాదం ఉందని అంటున్నారు. వాల్వ్ మాస్కుల కంటే గుడ్డతో చేసిన మాస్కులు బెటరని చెప్తున్నారు. రెండు మూడు లేయర్లు కలిగిన గుడ్డతో తయారు చేసిన మాస్కులను ధరిస్తే, బ్రీత్ ఔట్ గాలి బటయకువెళ్లినా, కరోనా వైరస్ మాస్క్ గుడ్డను దాటి బయటకు వెళ్లలేదని చెబుతున్నారు. వాల్వ్ ఉన్న మాస్కులు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి కానీ, కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేవని, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటం ఉత్తమమని చెబుతున్నారు.

Related posts