telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చేతకాక, పనులు చేయలేక జానారెడ్డి అలా మాట్లాడుతున్నారు..

Talasani Trs

జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్ నియోజిక పరిస్థితి దారుణంగా ఉందని… అధికారం పోయాక ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్‌ అయ్యారు.  హాలియా మున్సిపాలిటిలో డ్రైనేజీ లేదని…నర్సింహయ్య గెలిచాక కోటి రూపాయాలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్. జానారెడ్డి 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా,  మంత్రిగా ఉన్న సాగర్ నియోజక వర్గంలోని గ్రామాల్లో రోడ్లు సరిగా లేవని మండిపడ్డారు. భగత్ కు టికెట్ ఇచ్చాక… జానారెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటాడని అనుకున్నాం.. కానీ అలా జరగలేదన్నారు.  జానారెడ్డి  హుందాగా  నామినేషన్ విత్ డ్రా చేసుకొని దివంగత నోముల కుటుంబానికి సహకరిస్తే   కొంతైనా గౌరవం దక్కేదని తెలిపారు. చేతకాక, పనులు చేయలేక జానారెడ్డి… “ప్రచారం వద్దు  ఇంట్లో ఉందాం, ప్రచారానికి పోకుండా ఎన్నికలకు పోదాం”  లాంటి  మాటలు మాట్లాడుతూ  భయపడుతున్నారని ఎద్దేవా  చేశారు. జానారెడ్డి ఓడిపోవడం ఖాయం..ఈ విషయం ఆయనకు కూడా తెలుసు అన్నారు. అయితే చూడాలి మరి ఈ సాగర్ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.

Related posts