మరో ఐదు రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు జరుగనున్నాయి. ఈ కొత్త సంవత్సరం రాక ముందే.. మందుబాబులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు పోలీసులు. ఇక ఎక్కడపడితే అక్కడ తాగి ఇంటికి చేరుకోవడం మందుబాబులకు కష్టం కానుంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు మళ్లీ మొదలు పెట్టనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మళ్లీ శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో వారం రోజుల ముందే ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. నేటి నుంచి ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. కరోనా నిబంధనలు పాటిస్తూ ఫేస్ షీల్డ్లు ధరించి మరీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు.
previous post
next post