telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణాలో మావోల పని పట్టేందుకు వీరప్పన్ ని ఎన్కౌంటర్ చేసిన ఆఫీసర్…!

తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన వాజేడు వెంకటాపుర్ లో నిన్న గతంలో వీరప్పన్ ని ఎన్ కౌంటర్ చేసిన అధికారి, ఇండియన్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ డీజి విజయ్ కుమార్, తెలంగాణ- మహా రాష్ట్ర – ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులతో సమావేశం కానున్నారు. ఢిల్లీ నుండి విజయ్ కుమార్…హైదరాబాద్ నుండి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వేరు వేరు హెలికాప్టర్ లో వెంకట పూర్ కి చేరుకోనున్నారు.

 

ఛత్తీస్గఢ్ కి ఆనుకుని ఉన్న ములుగు జిల్లా. కొత్తగూడెం భద్రాచలం జిల్లాలోని దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారనే సమాచారంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సిఆర్పిఎఫ్ ఉన్నత అధికారులు మరియు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బెటాలియన్ ఉన్నత అధికారులు, స్పెషల్ పార్టీ టీమ్ అధికారులు భేటీ అయ్యారు. మావోల కట్టడికి పలు వ్యూహాలను విజయ్ కుమార్ సిద్దం చేశారు.

Related posts