కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న వాగ్దానంతో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ తన మాటపై నిలబడలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు చాలా మంది టీఆర్ఎస్ లో చేరారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు రాని వారు పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. 45 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.9,002 కోట్లు ఖర్చు అవుతుందని, దీనిలో కేంద్రం వాటా రూ.200 కోట్లు మాత్రమేనని అన్నారు. త్వరలోనే ‘పల్లె ప్రగతి’ తరహాలో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
చంద్రబాబు కుట్రపన్ని అప్పట్లో జగన్ పై కేసులు పెట్టారు: అంబటి