ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు జరుగనుంది.
హోంమంత్రి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, నర్సిరెడ్డి, జీవన్రెడ్డి, కూర రఘోత్తమరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మీర్జా రియాజ్ హసన్ నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి చేత మండలి ఇన్చార్జి చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.