telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పెండింగ్ బిల్లులతో చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పగించారు: మంత్రి కన్నబాబు

minister kannababu

మాజీ సీఎం చంద్రబాబునాయుడు పై ఏపీ మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 65 వేల కోట్ల  పెండింగ్ బిల్లులతో ఉన్న ప్రభుత్వాన్ని చంద్రబాబు తమకు అప్పగించారని అన్నారు. ఏపీ , చివరకు, చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా ‘పసుపు-కుంకుమ’ పథకానికి మళ్లించారని అన్నారు.

అయినప్పటికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘రైతు భరోసా’ కోసం మిగతా పథకాలు ఆగిపోయాయని, డబ్బులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు పచ్చి అబద్ధం అని అన్నారు. మొక్కజొన్న రైతులకు ఇచ్చిన హామీని జగన్ అమలు చేశారని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలు బలికాకూడదని, తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.

Related posts