telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వ్యసనంగా మారిన పబ్ జీ.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు!

Pubjee game boy death in hospital

సాంకేతిక రంగం అభివృద్ది చెందిన నేపథ్యంలో నేటి యువత రాత్రింభవళ్ళు స్మార్ట్ పై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ గేమ్ ఓ తెలంగాణ యువకునికి వ్యసనంగా మారింది. తాజాగా పబ్ జీ గేమ్ కు బానిసైన ఓ యువకుడు మెడ నరాలు దెబ్బతినడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో చోటుచేసుకుంది.

రాజారంపల్లి గ్రామానికి చెందిన సాగర్(20) తొలుత పబ్ జీ గేమ్ ను టైంపాస్ గా ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఇది కాస్తా వ్యసనంగా మారింది. దీంతో ఆ గీమ్ కు బానిసై 45 రోజులు అదేపనిగా పబ్ జీ ఆడటంతో మెడ నరాలు పట్టేశాయి. దీంతో కుటుంబ సభ్యులు సాగర్ ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, మెడ నరాలు పూర్తిగా దెబ్బతినడంతో సాగర్ ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.

Related posts