షామీ తన అధికారిక వెబ్సైట్ ‘ఎంఐ సూపర్ సేల్’ పేరుతో సేల్ ప్రారంభించింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఎంఐ, రెడ్మి, పోకో మొబైల్స్పై రాయితీలు ప్రకటించింది. ఎంఐ ఏ2, రెడ్మి వై3, పోకో ఎఫ్1పై ఎంఐ ఎక్స్ఛేంజ్లో అదనంగా రూ.2,000 వరకు రాయితీని ఇవ్వనుంది. రెడ్మి నోట్-7 ప్రో: 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత మెమొరీ గల వేరియంట్ రూ.13,999కే లభించనుంది. ఫీచర్స్: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, (48+5) మెగాపిక్సెల్ డ్యుయెల్ రేర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ముందు కెమెరా. రెడ్మి నోట్7 ఎస్: 3 జీబీ/32 జీబీ వెర్షన్ రూ.9,999కి రెడ్మి నోట్7ఎస్ రానుంది. 4 జీబీ/ 64 జీబీ వేరియంట్ రూ. 11,999కి లభిస్తుంది. ఫీచర్స్: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ తాకే తెర, 2340×1080 రిజల్యూషన్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్, (48+5) మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా.
రెడ్మి వై3: 3జీబీ ర్యామ్, 32జీబీ అంతర్గత మెమొరీ గల వేరియంట్ రూ.8,999కే లభించనుంది. 4 జీబీ/ 64 జీబీ వేరియంట్ రూ. 11,999కి లభిస్తుంది. ఫీచర్స్: ప్రైమ్ బ్లాక్, ఎలెగెంట్ బ్లూ, బోల్డ్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.26 అంగుళాల హెచ్డీ ప్లస్ తెర. రెడ్మి 7: 2 జీబీ/ 32 జీబీ వేరియంట్ రెడ్మి 7 రూ.7,499కే దొరకనుంది. 3 జీబీ / 32 జీబీ వేరియంట్ రూ. 8,499కి కొనుగోలు చేయొచ్చు. ఫీచర్స్: క్లిప్స్ బ్లాక్, కామెట్ బ్లూ, లూనార్ రెడ్ వంటి రంగుల్లో లభిస్తుంది.(12+2) మెగాపిక్సెల్ గల ఏఐ డ్యుయెల్ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.26 అంగుళాల హెచ్డీ ప్లస్ తెర.
పోకో ఎఫ్1: 6 జీబీ/64 జీబీ వేరియంట్ ధర రూ.17,999. 6 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ.18,999. 8 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.22,999. ఎంఐ ఎక్స్ఛేంజ్ ద్వారా అదనంగా ఇంకా రూ.2000 రాయితీ పొందే అవకాశం. ఫీచర్స్: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 మెగాపిక్సెల్ గల ముందు కెమెరా, (12+5) మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా. ఎంఐ ఏ2: 4 జీబీ/64 జీబీ వేరియంట్ రూ.9,999కి లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ద్వారా అదనంగా రూ.1000 వరకు రాయితీ పొందవచ్చు. ఫీచర్స్: ఆండ్రాయిడ్ వన్ ఓపరేటింగ్ సిస్టమ్, (12+20)మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ముందువైపు కెమెరా.