కొరటాల శివ దర్శకత్వంలో ఈ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతుంది. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఆచార్య షూటింగ్ కూడా ప్రస్తుతానికి హోల్డ్లోనే ఉంది. ఏడు నెలలుగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే.. కరోనా తర్వాత ఈ నెలలో ఆచార్య సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ పురాతన దేవాలయం సెట్లో నేటి నుంచి చిత్రీకరణ మొదలవనుండగా.. మూవీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇక్కడే షూట్ చేయనున్నారట. ఆచార్యలో దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేసే ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా చిరు కనిప్తాడని తెలుస్తోంది. ఇక రాంచరణ్ నక్సలైట్గా కనిపించనున్నాడు.
previous post
next post