telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

పేద ప్రజలకు సాయం చేసిన గొప్ప వ్యక్తి వేణుమాధవ్: శివాజీరాజా

shivaji-raja

హాస్య నటుడు వేణుమాధవ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ దుఖ:సాగరంలో మునిగిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం సినీ నటులు శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ, అనతికాలంలోనే వేణుమాధవ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారని అన్నారు.

పేద ప్రజల కోసం తన వంతు సాయం చేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో రేపు వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచుతామని తెలిపారు. వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు.వేణు టాలెంట్ ను చూసి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో అవకాశం ఇచ్చారని శివాజీరాజా తెలిపారు. ‘మా’ అసోసియేషన్ లో తనతో కలసి పని చేశాడని చెప్పారు.

Related posts