telugu navyamedia
క్రైమ్ వార్తలు

కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదంచోటుచేసుకుది. బాపులపాడు మండలం రేమల్లే మోహన్ స్పిన్ టెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో పత్తిబేళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంతో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. గోడౌన్ లో అంతా దూది , క్లాత్ మెటీరియల్ , దారాలు కావడంతో మంటలు అదుపు చేయటానికి ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది.. గోడవున్లో పత్తిబేళ్లకు మంటలు అంటుకోవడంతో తీవ్రనష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది విజయవాడ పరిసరాల్లోని 8 ఫైరింజన్లను తీసుకొచ్చి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. మిల్లులో పనిచేసే కార్మికులు… పత్తిబేళ్లు కాలిపోకుండా… కొన్నింటినిమాత్రం వెలుపలికి తీసుకొచ్చి పడేశారు. కార్మికుల కళ్లెదుటే… దారం, పత్తి కాలిపోతుంటే ఆవేదన భరితులయ్యారు.

Related posts