పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపుతప్పి రోడ్డు ప్రక్కన లోయలో పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ మృతి చెందారు. మృతుడు మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన వినీత్గా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.