telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్

acb telangana

లంచం తీసుకుంటూ ఫుడ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ వాజీద్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.4వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

గద్వాలకు చెందిన లక్ష్మీనరసింహా డిస్ట్రిబ్యూటర్స్ యజమాని భాను ప్రకాశ్ తన షాప్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అధికారికంగా చెల్లించాల్సిన రూ. 4వేలు డీడీ ద్వారా చెల్లించాడు. అయినప్పటికీ లైసెన్స్ కావాలంటే తనకు అదనంగా మరో రూ.4 వేలు ఇవ్వాలని భాను ప్రకాశ్ ను వాజీద్ డిమాండ్ చేశాడు. దీంతో భానుప్రకాశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వాజీద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

Related posts