telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది… ఈ వార్తలో ఇంత కిక్కు వుందా..? : మంచు మనోజ్

Manchu-Manoj

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. అయితే తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ హీరో మంచు మనోజ్ స్పందించారు. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా? అంటూ మనోజ్ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. “ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..? ఈ రోజునే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!” అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవలే ఆయన దిశ ఇంటికి వెళ్లి సైతం ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మనోజ్ భావోద్వేగానికి గురయ్యాడు.

Related posts