telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

హోదా కోసం ప్రాణత్యాగం.. 20 లక్షల పరిహారం..

chandrababu supports protest for special status

విభజిత ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వైఖరికి నిరసగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అర్జునరావు (40) మృతి విషయం తెలిసి సీఎం చలించిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాకుళం వాసి దావాల అర్జునరావు కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు.

పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం తప్పితే ప్రాణాలు తీసుకోవద్దని దీక్ష విరమణ అనంతరం చంద్రబాబు అన్నారు. కుటుంబాలను అనాథలను చేయవద్దని అన్నారు. అర్జునరావు కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు.

Related posts