telugu navyamedia
సినిమా వార్తలు

నటుడు విశాల్​కు షాకిచ్చిన హైకోర్టు : రూ.15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..

తమిళ నటుడు విశాల్​కు మద్రాస్​ హైకోర్టులో చుక్కెదురైంది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ ను ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరును ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ ‘వీరమే వాగౌ సుడుం’ కోసం రూ.15 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. సినిమా పూర్తిచేసి, విడుదల చేసినా ఇంకా ఆ రుణాన్ని విశాల్.. సదురు సంస్థకు తిరిగి చెల్లించలేదు. దీంతో లైకా సంస్థ.. విశాల్ ఫై కోర్టులో కేసు వేసింది.

ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్‌ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని ఇవ్వాల్సి ఉందని, మొత్తం రుణాన్నిఇప్పించవల్సిందిగా లైకా ప్రొడక్షన్స్ కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

Related posts