telugu navyamedia
క్రైమ్ వార్తలు

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..

టొరంటో: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీని ఆటో ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆటో లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని, బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని భారత రాయబారి అజయ్‌ బైసారియా పేర్కొన్నారు.

కాగా మృతులను హర్‌ప్రీత్‌ సింగ్‌, జస్పిందర్‌ సింగ్‌, కరన్‌పాల్‌ సింగ్‌, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌ కుమార్‌గా గుర్తించామని కెనడాలోని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Related posts