నిఖిల్ సిద్దార్థ్ – పల్లవి వర్మల వివాహం మే 14న హైదరాబాద్ శివారు ప్రాంతం శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ ఈ పెళ్లిని సింపుల్గా కానిచ్చేశారు. అయితే నిఖిల్ పెళ్లిపై సినీ నటి మాధవీలత ఇన్ డైరెక్ట్ అటాక్ చేస్తూ ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టింది. అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు?? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మేఘమాసం.. లేకుండా మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.. ఏ పెళ్లి పిల్ల దొరకదా.. లేకుంటే పిల్లోడు మారిపోతాడా?? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా?? ఫిక్స్ అయిన మ్యారేజ్లో గ్యాప్ వస్తే.. నిజాలు తెలిసే బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా అంటే.. ఈ పెళ్లి ఏంటో.. నాకు అర్థం కావడం లేదు’ అంటూ నిఖిల్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. నా పోస్ట్ నా ఇష్టం.. నా ఒపీనియన్ నేను చెప్తా.. నాకు ఆహక్కు ఉంది అంటూ డిస్క్లైమర్ పెట్టింది మాధవీలత. దీంతో ఆమె పోస్ట్ ఇప్పుడుద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్-3లో నన్ను హింసించారు : నటి మధుమిత