తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించిన శృతి మరాటే తాను ఎదుర్కొన్న మీటూ సంఘటన గురించి ధైర్యంగా బయటకు చెప్పింది. ఓ నిర్మాత తనతో తప్పుగా ప్రవర్తించారని, దానికి తగ్గట్టుగానే అతడికి ధీటైన సమాధానం కూడా చెప్పానని వెల్లడించింది. శృతి మాట్లాడుతూ ”అప్పట్లో అవకాశం రావడమే గొప్ప. అందుకే అడిగిన వెంటనే బికినీ వేసుకున్నాను. నాకు కాస్త ఫేం వచ్చిన తరువాత ఆ బికినీ ఫోటోలను బాగా ట్రోల్ చేశారు. నేను వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ ఓ నిర్మాత సినిమా ఆఫర్ ఇస్తానని నన్ను సంప్రదించాడు. ముందు బాగా మాట్లాడి, తరువాత కాంప్రమైజ్ కావాలి. ఒకరాత్రి పడుకోవాలని అన్నాడు. వెంటనే నేను, నీతో ఒకరాత్రి పడుకుంటే హీరోతో ఎవరు పడుకుంటారని అతడిని ప్రశ్నించాను” అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అయితే నిర్మాత చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో తనను సినిమా నుండి తప్పించారని, అయినా తను బాధపడలేదని, కేవలం మహిళల్లో ధైర్యం నింపడానికే తను దీని గురించి బయటపెట్టానని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది.
previous post