కరోనా విలయతాండవంపై ఇప్పటికే చాలా సాంగ్స్ వచ్చాయి. ప్రజలను అప్రమత్తం చేసేలా, అవగాహన కల్పించేలా కళాకారులు పాటలను రూపొందించారు. తాజాగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ కరోనాపై పోరాడుతున్న పోలీసుల శాఖ సేవలను ప్రశంసిస్తూ అద్భుతమైన గీతాన్ని అందించారు. ఈ గేయాన్ని రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖల సిబ్బంది అందిస్తున్న కృషిని ప్రోత్సహించేలా పాటను రూపొందించడంపై మహిత్నారాయణ్, ఆయన బృందాన్ని డీజీపీ అభినందించారు. “కొరోనా విళయతాండవం చేస్తున్నవేళ, మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్-డౌన్ నేపథ్యంలో, యావత్ ప్రపంచమే స్తబ్దావస్థకు చేరుకున్నా, అటు వైరస్ వ్యాప్తిచెందకుండా ఇటు వ్యవస్థ సాఫీగా సాగేందుకు ముందుండి పోరాడుతున్న యోధులందరికీ అంకితం ఈ వీడియో…” అంటూ డిజిపి తెలంగాణ పోలీస్ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేశారు.
A tribute by @GillaMahit & team.
కొరోనా విళయతాండవం చేస్తున్నవేళ, మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్-డౌన్ నేపథ్యంలో, యావత్ ప్రపంచమే స్తబ్దావస్థకు చేరుకున్నా, అటు వైరస్ వ్యాప్తిచెందకుండా ఇటు వ్యవస్థ సాఫీగా సాగేందుకు ముందుండి పోరాడుతున్న యోధులందరికీ అంకితం ఈ వీడియో… pic.twitter.com/9P2JltJisC— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 22, 2020