telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

ఏపీ ప్రజలకు .. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన.. సీఎం, గవర్నర్ ..

apcm and governor wishes on srikrishna

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, పురోగతి, శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలని ఆకాంక్షించారు. సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి ఈ పర్వదినం పునాది అని, సోదరభావం, స్నేహం, సామరస్యత మరింత పెరగాలని గవర్నర్ ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా ప్రజలంతా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారని జగన్ పేర్కొన్నారు. ప్రజల జీవితాలు సంతోషమయం కావాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.

Related posts