టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇపుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ రోజు దర్శక రత్న దివంగత దాసరి నారాయణ రావు జయంతి. ఈ రోజు దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ రావును ఎవరు రీప్లేస్ చేయలేరు..ఇండస్ట్రీ పెద్దగా అప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణ రావు గారే ఉంటారు అంటూ ట్వీట్ చేసారు.
దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మంచు విష్ణుపై విరుచుకుపడుతున్నారు. దాసరి నారాయణ రావు మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దను కోల్పోయింది. ఆ స్థానంలో చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఇండస్ట్రీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మెగాస్టారే ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్ద అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు చిరంజీవి కూడా నేను ఇండస్ట్రీని పెద్దను కాదు.. ఇండస్ట్రీ బిడ్డను. ఓ బిడ్డగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సాయం చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు. ఇందులో ఎవరు పెద్ద, చిన్నా అనే తేడా లేదు అంటూ తన హుందాతనం చాటుకున్నారు.
ఇక మంచు విష్ణు ట్వీట్ తో మరోసారి బయటపడింది మెగా ఫ్యామిలీపై మంచు ఫ్యామిలీకి ఎంత కసి అని ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Remembering the Man, the Legend, Sri Dasari garu. The one and only Guru garu. His place can never be replaced. Miss him a lot. pic.twitter.com/eHqt9cIrKh
— Vishnu Manchu (@iVishnuManchu) May 4, 2022
నిత్యామీనన్ తిండిపోతు… అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్