telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కూతుళ్లను చంపేసిన తల్లిదండ్రులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్…

మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన పురుషోత్తం నాయుడు, పద్మజ.. తాజాగా  కోలుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. దీంతో చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు విశాఖపట్నం చేరుకున్నారు. ఒక ఎస్.ఐ, ఐదుగురు పోలీసులు ఎస్కార్ట్ వెహికల్ తో వచ్చి చేరుకున్నారు. అయితే క్షద్రపూజల పిచ్చితో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజలు చంపిన విషయం తెలిసిందే. దాంతో విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించిన క్రమంలో వారి మానసిక స్థితి మెరుగయింది. ఈ క్రమంలో మరికాసేపట్లో మదనపల్లి పోలీసులకు వైద్యులు భార్యాభర్తలను అప్పగించనున్నారు. కన్న కూతుళ్లను హత్య చేసిన కేసులో పురుషోత్తం, పద్మజలు పశ్చాత్తాపం పడుతున్నారని తెలుస్తోంది. పురుషోత్తం నాయుడు, పద్మజ లను ఇద్దరిని రోడ్డు మార్గంలో మదనపల్లి సబ్ జైలు కు పోలీసులు తరలించనున్నారు. అయితే ఈ కేసు గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ కేసులో కోర్టు వారికీ ఏ విధమైన శిక్ష విదిస్తుంది అనేది.

Related posts