మహబూబాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఆ జిల్లాలోని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని మహ్మద్ మైబెల్లి ఇంట్లో పాములు కలకలం రేపాయి. అతని ఇంటి ఆవరణలో ఉన్న ఓ బండరాయి కింద నుంచి తొలుత ఒక పాము బయటకు వచ్చింది. దానిని స్థానికుల సాయంతో అతను చంపేశాడు. అనంతరం మరోకటి రాగా దానిని కూడా చంపేశారు. అయినప్పటికీ వరుసగా పాములు వస్తుండటాన్ని గమనించిన మైబెల్లి.. ఆ బండరాయి తొలగించి చూడగా.. దానికింద కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు కనిపించాయి. దీంతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. సుమారు 120 వరకు పెద్ద పాముతో పాటు దాని పిల్లలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వెంటనే స్థానికుల సాయంతో వాటిని మైబెల్లి చంపేశాడు. ఒకేసారి వందలాది పాములను చూడటంతో గ్రామస్థులు కొంత భయాందోళనకు గురయ్యారు.
అమరాతిలో చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్