యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. “సాహో” ఈ శుక్రవారం విడుదల కానుండగా, అదనపు షోలను, టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ సర్కారు అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టికెట్లను దారుణంగా పెంచేశారని, రూ. 300 వరకూ నిర్ణయించారని, వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నట్టి కుమార్ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జీ శ్యామ్ ప్రసాద్, చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్కార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్, “సాహో” చిత్ర పంపిణీదారు దిల్ రాజు తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ నేడు కొనసాగనుంది.
previous post