telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ బాబు కోసం మూడు సింహాల సింహాసనం…!

Manchu family

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కరోనా వైరస్ కారణంగా తిరుపతిలోని శ్రీవిద్యా‌నికేతన్‌లో జరగాల్సిన పుట్టినరోజు వేడుకలను రద్దు చేస్తూ మోహన్ బాబు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు మార్చి 19న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. 2020తో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తండ్రికి పుట్టినరోజు కానుకగా కుమార్తె లక్ష్మీ ప్రసన్న సింహాసనం చేయించింది. మోహన్ బాబు సింహాసనాసీనులై.. భార్య, కుమారులు, కుమార్తె, మనవరాలతో కలిసి తీసుకున్న ఫోటోను లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మా నాన్నకు కొత్త సింహాసనం.. ఈ సింహాసనంలోకి మూడు సింహాలు.. మా ముగ్గురికి (లక్ష్మీ, విష్ణు, మనోజ్) నిదర్శనం.. దీన్ని నేనే తయారు చేయించాను’ అని తెలిపింది. ఇక మోహన్ బాబు తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘సూరరైపోట్రు’ (ఆకాశం నీ హద్దురా) చిత్రంలో నటిస్తున్నారు.

Related posts