రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోదీ గురువారం ఉదయం మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయీలకు నివాళులు అర్పించారు. తొలుత ఢిల్లీఃలోని రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన తర్వాత అక్కడికి సమీపంలోని సదైవ్ అటల్ వద్దకు వెళ్లి వాజ్పేయీకి నివాళులర్పించారు. అనంతరం జాతీయ యుద్ధ స్మారక స్తూపం వద్దకు చేరకొని అమరవీరులకు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
నేటి సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ప్రధాని ప్రమాణ స్వీకారోత్సావం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు రానున్నారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, కిర్గిజ్ అధ్యక్షుడు సూరోన్బే జీన్బెకోవ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మైంట్, భూటాన్ ప్రధాని లోటయ్ సెరింగ్, థాయ్లాండ్ ప్రత్యేక దూత గ్రిసాద బూన్రాచ్లు హాజరుకానున్నారు. అలాగే మోదీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రానున్నారు.
కొత్త పార్టీల ప్రభావం అంతగా ఉండదు: బాలకృష్ణ