భారత ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా ప్రభావం, ఆర్ధిక ఇబ్బందులు, తీవ్రవాదం అరికట్టే విషయంలో అంతర్జాతీయంగా ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశాన్ని అన్ని విధాలుగా నష్టపరిచారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సరిహద్దు దేశాలతో ప్రధాని వ్యవహారం దారుణంగా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, పాక్ ప్రధానిపై ఒకనాటి సహచర క్రికెటర్ సర్పరాజ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని డ్రగ్స్ కి బానిస అని అన్నారు. 1987 లో ఇమ్రాన్ ఖాన్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ పూర్తైన తరువాత ఇస్లామాబాద్ వచ్చిన తరువాత డ్రగ్స్ తీసుకున్నారని అన్నారు. తన కళ్లారా చూశానని తెలిపారు. అంతకు ముందు కూడా ఇమ్రాన్ ఖాన్ అనేకమార్లు కొకైన్ వంటి డ్రగ్స్ పీల్చడం చూశానని, తనతో పాటు అప్పట్లో కొంతమంది క్రికెటర్లకు కూడా తెలుసునని అన్నారు. ఇమ్రాన్ ను తన ముందుకు తీసుకొస్తే ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తానని సర్పరాజ్ నవాజ్ అంటున్నాడు. దాంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post
next post