లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించిండంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
ఇటీవలే ఆమెకు కరోనా వైరస్ సోకడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అప్పటినుంచి ఆమెను ఐసీయూలో ఉంచి డాక్టర్ ప్రతిత్ సంధాని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది.
ఆ తర్వాత జనవరి 27న హాస్పిటల్ లో వెంటిలేటర్ తొలగించారని, ఆమె అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారని, చేతితో సైగలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి తిరిగి విషమించడంతో మళ్ళీ వెంటిలేటర్ సాయంతో చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు.