బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్నభారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చిత్రానికి సంబంధించి వీడియోలు విడుదలై భారీ ప్రేక్షకాదరణను పొందాయి. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, చుంకీ పాండే వంటి స్టార్స్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకురాబోతున్నారనేది తాజా సమాచారం. పాప్ గాయనిగా వరల్డ్వైడ్గా పేరు ప్రఖ్యాతలు పొందిన బ్రిటీష్ భామ కైలీ మినోగ్ “సాహో”లో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో అక్షయ్ నటించిన “బ్లూ” సినిమాలో కూడా ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేసింది. దాదాపు పదేళ్ళ తర్వాత మళ్లీ ఇండియన్ సినిమా చేయడానికి అంగీకరించింది కైలీ మినోగ్. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.
రామ్ చరణ్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు