telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని రాజన్న పేట లో నిర్వ‌హించిన‌ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. హ‌రిత‌హారంలో భాగంగా మొక్క‌లు నాటారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 70 ఏండ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడేండ్ల‌లో చేసి చూపించామ‌ని చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు. ఆస‌రా పెన్ష‌న్లు 10 రెట్లు పెంచామ‌ని.. 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. 57 ఏండ్లు నిండిన వారికి త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు ఇస్తామ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్లే మానేరు నిండింద‌న్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండ‌టంతో మ‌త్స్య‌కారులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం వ‌చ్చినంక‌నే చెరువులు బాగు ప‌డ్డాయ‌ని చెప్పారు. తెలంగాణ ఏర్ప‌డ్డాకే రాష్ర్టంలో 24 గంట‌ల క‌రెంట్ వ‌చ్చింద‌న్నారు. త్వ‌ర‌లోనే రెండో విడ‌త గొర్రెల పెంప‌కం చేప‌డుతామ‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ర్టంలోని 12,769 గ్రామ పంచాయ‌తీల్లో ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్, న‌ర్స‌రీ ఏర్పాటు చేశామ‌న్నారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ అమ‌లు చేస్తోంద‌న్నారు. క‌రోనా స‌మ‌యంలో ఆక్సిజ‌న్ విలువ అంద‌రికీ తెలిసింది. ప్ర‌తి ఇంట్లో ఉన్న ఒక్కొక్క‌రు క‌నీసం ఒక మొక్క నాటి పెంచాల‌ని కేటీఆర్ చెప్పారు.

Related posts