telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్రాక్ సినిమా పై కేసు ఫైల్…

Krack

ప్రస్తుతం ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ `క్రాక్‌`.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న `క్రాక్` సినిమా సంక్రాంతి 2021 రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ సినిమా ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కోర్టుకు వెళ్లటంతో లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమా రిలీజ్ అపేలా స్టే ఇవ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ కోరినట్లు సమాచారం. ఈ చిత్రం నిర్మాత టాగోర్ మధు గతేడాది విశాల్ హీరోగా టెంపర్ రీమేక్ అయోగ్యను నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే స్క్రీన్ సీన్ మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పుడు టాగోర్ మధుపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా క్రాక్ సినిమాను రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ కేసును ఫైల్ చేసింది. ఆ డబ్బులు క్లియర్ చేస్తేనే క్రాక్ సినిమా ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది అని కోర్టులో స్టే పిటిషన్ ని వేశారని సమాచారం. సినిమా విడుదలపై ఈ ఎఫెక్ట్ చూపే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఒకవేళ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ఆ డబ్బును నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది.

Related posts