telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కోట‌క్ మ‌హీంద్రా ఎండీ రూ.50 కోట్ల విరాళం

ghmc 20000 penalty to kotak bank

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు విరాళాలు అంద‌జేయాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్య‌లో దాత‌లు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కోట‌క్ మ‌హీంద్రాబ్యాంక్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఉద‌య్ కోట‌క్ పీఎం కేర్స్ ఫండ్స్ కు రూ.50 కోట్లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కోట‌క్ మ‌హీంద్రాబ్యాంక్ త‌ర‌పున రూ.25 కోట్లు, ఎంపీ ఉద‌య్ కోట‌క్ వ్య‌క్తిగ‌తంగా రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్ల‌ను నిధికి విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తితో ఇబ్బందులేద్ర్కోంటున్న పేద ప్ర‌జ‌ల కోసం, క‌రోనాను అడ్డుకునేందుకు తీసుకునే స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఈ మొత్తాన్ని వినియోగించ‌నున్నారు.

Related posts