ప్రభుత్వాలు మన కోసం కష్టపడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో బయటకు వెళ్లి పనిచేసుకోలేక కుటుంబపోషణకు కష్టమవుతుంది. కాబట్టి ఏపీ సీఎం జగన్ ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా రేషన్ఇ వ్వాలని నిర్ణయించారు. నిన్న మూడు నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు మొదటి విడత,ఏప్రిల్ 15న రెండో విడత,ఏప్రిల్ 29 వతేదీన మూడోవిడతగా రేషన్ ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
ప్రతి వ్యక్తికి ఐదుకిలోలు బియ్యం, ప్రతి కార్డుకు కేజి కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేయడమే కాకుండా పేదలకు నిత్యావసరవస్తువులు అందుబాటులోకి తీసుకురావడమనేది చాలా గొప్ప విషయం.దీంట్లో పోలీసులు చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసులకు మనమందరం అండగా ఉండాలని రోజా పేర్కొన్నారు.
ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతాం: డీకే అరుణ