తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన కేసీఆర్, కనీసం ప్రతిపక్ష నేతగా దళితుడు ఉంటే కూడా ఓర్వలేదని విమర్శించారు. టీఆర్ఎస్ తీరుకు నిరసనగా మంగళవారం కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. పార్టీ పిరాయింపులపై చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ నామరూపం లేకుండా పోవడం ఖాయమని అన్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్