telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : ఢిల్లీకి షాక్ ఇచ్చిన కోలకతా..

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కి బ్రేక్ పడింది. సులభంగా గెలుస్తారన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కోలకతా నైట్ రైడర్స్ షాక్ ఇచ్చింది. బ్యాట్స్ మాన్ ఘోరంగా విఫలమవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 135 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. మంచి జోరు మీదున్న శిఖర్ ధావన్ 6 పరుగులకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ అజింక్య రహానే డక్ అవుట్ అయ్యాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 47 పరుగులు, కీపర్ పంత్ 27 పరుగులతో రాణించారు. అయినా విజయం దక్కలేదు. అటు కోలకతా బౌలింగ్ దుమ్ము లేపింది. వరుణ్ చక్రవర్తి ఏకంగా 3 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి కోలకతా కు విజయాన్ని అందించాడు. ఇంకో బౌలర్ కమిన్స్ 3 వికెట్స్ తీసాడు. దాంతో కేకేఆర్ 59 పరుగుల తేడాతో ఈ ఏడాది ఐపీఎల్ లో 6వ విజయాన్ని నమోదుచేసి పాయింట్ల పట్టికలో తమ 4 వ స్థానాన్ని కాపాడుకుంది. అంతకుముందు బాటింగ్ చేసిన కేకేఆర్.. ఓపెనర్ నితీష్ రానా(81), సునీల్ నరైన్ (64) అర్ధశతకాలతో రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. 

Related posts