జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు కాకినాడలో “రైతు సౌభాగ్య దీక్ష” చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీక్షకు రాపాక హాజరు కాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన రాలేదని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవలి కాలంలో రాపాక పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం లేదన్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ నేతలకు దగ్గరగా ఉంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ‘రైతు సౌభాగ్య దీక్ష’కు ఎమ్మెల్యే రాపాక హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మోదీతో రాజీనామా చేయించాలని వాజ్పేయి భావించారు: యశ్వంత్ సిన్హా