తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్సింగ్” చిత్రంతో కెరీర్లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్తో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. కియారా అద్వానీ తాజాగా కోలీవుడ్లో తొలి అడుగు వేయబోతున్నది. విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. అయితే ఈమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వినిపించాయి. అతనితో కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు హాజరుకావడంతో వీరి గురించి గాసిప్లు వచ్చాయి. తాజాగా తన లవ్లైఫ్ గురించి కియార మాట్లాడింది. “ప్రేమ అనేది వ్యక్తిగతం. దానిని కెరీర్తో ముడిపెట్టలేము. ప్రేమ అనేది ఎప్పుడైనా, ఎవరి మీదైనా పుట్టొచ్చు. అయితే ప్రస్తుతానికి నేను ప్రేమలో లేను. అయినా నేను ప్రేమలో పడితే దాచుకోను. ఆ అందమైన భావనను వెల్లడించాల్సిందే. సినిమా కెరీర్కు ప్రేమ అడ్డంకి కాదు” అని కియారా తెలిపింది.
previous post