గత కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే ఇటీవల ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్లో వీరి బ్రేకప్ హాట్ టాపిక్గా మారింది. ఆ తరువాత ఇలియానా తన ఫిజిక్ మీద దృష్టి పెట్టింది. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందని వార్తలు విన్పిస్తున్నాయి. అంతేకాదు ఈ బ్యూటీ చిరంజీవి సరసన కథానాయికగా నటించబోతోంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా… తాజాగా ఓ నెటిజన్ పై ఫైర్ అయ్యింది ఇల్లీ బేబీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నటీమణుల్లో ఇలియానా ఒకరు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అని అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆమె అభిరుచుల గురించి, సినిమాల గురించి పలువురు అడిగారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ‘మీరు కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..?’ అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఇలియానా “వావ్… అవతలివారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? చాలా ఎక్కువైంది. మీ అమ్మ ఏం చెబుతుంది?” అని అడిగారు. ఆ మధ్య బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్కు కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. నెటిజన్లు ఏ విషయంలోనైనా పరిమిత పరిధులు ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలు అడిగే అవసరం ఉండదు.
previous post
next post