telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం…

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిరంతర ప్రవాహినిలా ముందుకు సాగుతుంది. ఇది మనందరి బాధ్యతకదా, మన సమాజం కదా అన్న భావనతో ఛాలెంజ్ ను అందుకున్న ప్రతీ ఒక్కరు తమ వంతుగా మూడు మొక్కలు నాటుతున్నారు. అయితే పర్యావరణ ప్రేమికుల స్పూర్తితో మూడు మొక్కల నుంచి గుంపులుగా నాటే స్టేజీకి చేరుకుంది. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులకు విసిరే ఛాలెంజ్ మూడు సమూహాలకు చేరుకుంది. ఒక వన భోజనంలా అందరి హృదయాలకు చేరువయ్యింది.
ఇందులో భాగంగా ఈ రోజు ఇండియన్ సినీ జక్కన్న తన RRR టీంతో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొన్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి లింగంపల్లిలోని తన కార్యాలయంలో 25 మంది యూనిట్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జక్కన్న మాట్లాడుతూ.. *.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి ఆలోచన… ప్రకృతిని పరిరక్షించడానికి తన వంతు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు… ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలి, మొక్కలు నాటాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రాజమౌళి వ్యక్తిగతంగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ, పూరీజగన్నథ్, వివి వినాయక్ లతో పాటు, తన RRR చిత్ర యూనిట్ తరఫున మెగాస్టార్ “ఆచార్య”, యంగ్ రెబల్ స్టార్ “రాధేశ్యాం”, అల్లు అర్జున్ “పుష్ప” చిత్రబృందాలకి ఛాలెంజ్ చేశారు.

Related posts