టాలీవుడ్ చందమామ, ప్రముఖ సినీ నటి కాజల్ ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతానికి షూటింగుల పని పక్కన పెట్టి ముందు భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది కాజల్. ఈ విషయాన్ని ఇటీవలే కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. మాల్దీవ్స్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో సేద తీరుతున్నారు ఈ జంట. అయితే కాజల్ పెళ్ళికి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా తక్కువ మంది సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే పెళ్లి నిరాడంబరంగా జరిగినా కూడా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గానే ప్లాన్ చేస్తుంది చందమామ. దీనికోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తుంది ఈ బ్యూటీ. కొన్ని రోజుల తర్వాత భారీగానే ఈ వేడుక ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించబోతుంది కాజల్ అగర్వాల్. అయితే.. తాజాగా తన భర్త గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది కాజల్. తాను గౌతమ్తో పెళ్లికి ఒప్పుకోవడానికి ఓ కారణం ఉందని చెప్పింది కాజల్. అందరు అమ్మాయిల్లానే.. తనకు కాబోయేవాడు మోకాళ్లపై నిలబడి గులాబీ అందించి తన లవ్ను ఎక్స్ ప్రెస్ చేయాలని కోరుకుందట ఈ భామ. ఇక కాజల్ ఎలా అయితే.. ఆశపడిందో ఆ విధంగానే గౌతమ్ తనకు ప్రపోజ్ చేశాడట. అందుకు గౌతమ్తో కాజల్ పెళ్లికి ఒప్పుకుందట. గౌతమ్ ముందే తన పేరెంట్స్తో మాట్లాడి.. పెళ్లి ఫిక్స్ చేసేసుకున్నాడని.. అయినా కూడా తనకు మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేయాలని రూల్ పెట్టానని కాజల్ చెప్పింది. తనకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టమని చెప్పికొచ్చింది చందమామ.
previous post
next post