1990, 2000లలో ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. పెళ్ళి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. నాలుగు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు. సినిమాలు చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఫైన్ వైన్ లాగా ఆమె వయసు పెరిగే కొద్దీ అందం రెట్టింపవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కరిష్మా తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. బికినీలో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను అభిమానుల కోసం షేర్ చేసింది. ఇంకేముంది ఈ ఫొటోకు మూడు లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. కుటుంబం కోసం సినిమాలకు దూరమైన కరిష్మాకు వైవాహిక జీవితం కూడా సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తన చిన్ననాటి స్నేహితుడు సంజయ్ కపూర్ను కరిష్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లుగా వీరి మధ్య తగదాలు వస్తూనే ఉండటంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కరిష్మా సందీప్ తోష్నీవాల్ అనే వ్యాపారవేత్తోత డేటింగ్ చేశారు. కొంతకాలం తర్వాత వీరు కూడా విడిపోయారు. మరోపక్క సంజయ్ ప్రియ అనే దిల్లీకి చెందిన మోడల్ను వివాహం చేసుకున్నారు. ఓసారి పెళ్లి గురించి మీడియా వర్గాలు కరిష్మాను ప్రశ్నిస్తే.. తనకు అలాంటి ఆలోచనలు లేవని, ఇక జీవితం తన పిల్లలకే అంకితమని తెలిపారు. ఇక ఎక్కువగా కరిష్మా తన చెల్లి కరీనా, స్నేహితులు మలైకా అరోరాలతోనే కనిపిస్తూ ఉంటారు. వీరు ముగ్గురూ తరచూ పార్టీలకు వెళుతుంటారు.
previous post
next post
అల్లు కాంపౌండ్… “పేట” నిర్మాతలకు వార్నింగ్