పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్కు, కొడుకు అకీరాకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా రేణూ దేశాయ్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్లో చాలామంది కరోనా బారిన పడిన సెలబ్రిటీలు హోం క్వారంటీన్లో ఉంటున్నారు. మరికొందరు చికిత్స కోసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
ఇప్పటికే టాలీవుడ్లో మహేశ్బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
తాజాగా నటి రేణు దేశాయ్కు, కొడుకు అకీరాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. “హల్లో.. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ.. నాకు, అకీరాకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం మేమిద్దరం కోలుకుంటున్నాం. అందరూ దయచేసి థర్డ్ వేవ్ను సీరియస్గా తీసుకోండి..మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండిష ..
నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది రేణు.