టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కొద్దిరోజుల క్రితం తన పెళ్లి గురించి అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రేమ పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు కాజల్ ప్రకటించింది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకుంటున్నట్లు కాజల్ వెల్లడించింది. తన స్నేహితుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనుంది. వారి వివాహనికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న(బుధవారం) మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్ గురువారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ‘ఈ రోజు మహందీ వేడుక అయిపోయింది..రేపు హల్ది ఫంక్షన్’ అంటూ పంచుకున్నారు.. ఈ ఫొటోలో కాజల్ నవ్వూతూ తన మెహేందీ చేతులను చూపిస్తూ ఫోజ్ ఇచ్చింది. దీంతో కాజల్ సోదరి, నటి నిషా ఆగర్వాల్, స్టెలిస్ట్ నీరజా కోన, ఈషా అమిన్, ఇతర నటీనటులు కాబోయే పెళ్లి కూతురుకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ రోజు ముంబైలో హల్ది ఫంక్షన్ జరనుంది.
previous post
next post