telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీకి పట్టిన శని… చంద్రబాబు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జిల్లాలో ఇవాళ డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ… జిల్లాలో ఉన్న రైతుల సమస్యలపై డీఆర్సీ సమావేశంలో చర్చించామని… జిల్లాలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు సత్వర పరిహారం సహా 80 శాతంపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామని.. పంట నష్ట పోయిన రైతులందరినీ సీఎం జగన్ ఆదుకుంటారని తెలిపారు. ప్రభుత్వంలో 98 శాతం మందికి న్యాయం జరుగుతోందని.. మిగిలిన రెండు శాతం మందిని తీసుకొచ్చి కొన్ని రాజకీయ పార్టీలు వివాదం చేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. ఏలూరు లో ప్రజల అస్వస్తత దృష్ట్యా ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోందని.. ఏలూరు ఘటనపై టీడీపీ రాజకీయం చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. టీడీపీకి పట్టిన శని చంద్రబాబు నాయుడని.. హైదరాబాద్ ప్రజలు చంద్రబాబును అండర్ గ్రౌండ్ డ్రైనేజిలో పెట్టారని ఫైర్‌ అయ్యారు. ప్రజలను అభద్రతకు గురి చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.

Related posts